29.7 C
Hyderabad
May 6, 2024 03: 31 AM
Slider ఖమ్మం

ఒదుగుతూ ఎదగడం తన నైజం

it's his job to grow

రాజకీయమన్నాక అనేక ఒడిదుడుకులు ఉంటాయని, పదవులు శాశ్వతం కాదని,  అభిమానుల అండదండలే తన ఎదుగుదలకు దోహదపడుతాయని, ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండటం నా నైజమని తెరాస రాష్ట్ర నాయకులు, మాజీ ఖమ్మం పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ముదిగొండ మండలంలోని యడవల్లి లక్ష్మీపురం, ముదిగొండ మండల కేంద్రం, కమలాపురం, అయ్యగారి పల్లి గ్రామాల్లో మంగళవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ నిరంతరం ప్రజల్లో ఉండాలనే తపనతోనే పర్యటనలు చేస్తున్నానని దీని వెనుక ఎటువంటి రాజకీయ దురుద్దేశం లేదని మరోమారు స్పష్టం చేశారు. పర్యటనలో భాగంగా వివిధ కారణాలతో మృతిచెందిన పలువురు వ్యక్తుల కుటుంబాలను, అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులను పరామర్శించి ఆర్థికసాయాలను అందజేశారు. పలు శుభ కార్యాలకు హాజరై నూతన వస్త్రాలను కానుకగా అందజేశారు. ఏ కష్టంమొచ్చినా తానున్నా అనే భరోసానిస్తూ తన పర్యటనను కొనసాగించారు. ఈ కార్యక్రమంలో పొంగులేటి వెంట ఎంపీపీ సామినేని హరి ప్రసాద్ పాల్గొన్నారు.

Related posts

జర్నలిస్టుపై చేసిన వ్యాఖ్యలను యూట‌ర్న్‌

Sub Editor

మైదుకూరు వైస్ చైర్మన్ ఎన్నికను బహిష్కరించిన తెలుగుదేశం

Sub Editor 2

జులై 9 నుంచి ఆషాఢ బోనాలు

Bhavani

Leave a Comment