కడప జిల్లా మైదుకూరు పురపాలిక రెండవ వైస్ చైర్మన్ ఎన్నిక శుక్రవారం నిర్వహించారు.
వైస్ చైర్మన్ ఎన్నికను తెలుగుదేశం కౌన్సిలర్లు బహిష్కరించగా,వైసీపీ కౌన్సిలర్లు హాజరయ్యారు. రెండవ వైస్ చైర్మన్ గా ఎనిమిదో వార్డు కౌన్సిలర్ ములే రేణుక ఎన్నికయ్యారు.
ఎక్స్ అఫీషియో సభ్యులు ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు.