27.7 C
Hyderabad
May 4, 2024 07: 32 AM
Slider ముఖ్యంశాలు

పెంచుతున్న పన్నుల సొమ్ము అంతా సొంత పత్రికకే

#Yanamala Ramakrishnudu

ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఉద్యోగుల సంక్షేమాన్ని గాలికొదిలి తన సొంత పార్టీ కార్యకర్తలైన వాలంటీర్లకు ప్రజల సొమ్మును దోచిపెడుతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ప్రభుత్వానికి ప్రజలకు వారదిగా పనిచేసేది ఉద్యోగులే. దేశంలో ఏ ప్రభుత్వమైనా సజావుగా పాలన సాగించాలంటే దానికి ఉద్యోగుల కృషి తప్పనిసరి. కానీ అలాంటి ఉద్యోగుల్ని జగన్ రెడ్డి తన కాలికింద బానిసల్లా చూస్తున్నారని ఆయన అన్నారు.

ఉద్యోగులకు రావాల్సిన వేతనాలు సకాలంలో ఇవ్వటం లేదని, జగన్ రెడ్డి మూడేళ్ల పాలనలో ప్రతి నెలా 1 వ తేదీ జీతాలు అందుకున్న సంఘటనలు అరుదు అని ఆయన అన్నారు. మరో వైపు రివర్స్ పీఆర్సీతో ఉన్న జీతాల్లో కోత విధించారు. డీఎలు, అలవెన్సులు  లేవు.  ఉద్యోగులకు అన్ని విధాల అన్యాయం చేస్తున్న జగన్ రెడ్డి తన పార్టీ కార్యకర్తలైన వాలంటీర్లకు మాత్రం అన్ని విధాల న్యాయం చేస్తున్నారని యనమల అన్నారు. 

ప్రతి సంక్షేమ పధకంలోనూ ప్రజల్ని పీడించుకుని లంచాలు వసూలు చేస్తున్న వాలంటీర్లకు ‎నెలకు రూ. 5 వేలు జీతం ఇవ్వటమే ఎక్కువ అని ప్రజలు భావిస్తుంటే జగన్ రెడ్డి మాత్రం అవి చాలవన్నట్టు వారికి సేవారత్న, సేవా వజ్ర అంటూ అవార్డుల పేరుతో రూ.485.44 కోట్లు దోచిపెట్టారని యనమల విమర్శించారు. ఇప్పుడు వార్తా పత్రికల కోసం అంటూ ఒక్కో వాలంటీర్ కు నెలకు రూ. 200 చొప్పున చెల్లించేందుకు జీవో జారీ చేశారు.

రాష్ట్రంలో సుమారు 2.66 లక్షల మంది గ్రామ, వార్డు వాలంటీర్లు ఉన్నారు. వీరికి ప్రతి నెల రూ. 200 చొప్పున మెత్తం రూ. 5.50 కోట్లు ఖర్చువుంతుంది. జగన్ రెడ్డి ప్రభుత్వ ధనాన్ని వాలంటీర్లకు ఇస్తూ వారితో సొంత పత్రిక సాక్షి కొనుగొలు చేసేలా చేసి తిరిగి ఆడబ్బును తన సొంత ఖజానాకు లాక్కుంటున్నారు. జగన్ రెడ్డి  కన్నింగ్ నెస్ ఐడియాలజీతో బిజినెస్ చేస్తున్నారని యనమల తెలిపారు.

ప్రజా సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానంటున్న జగన్ రెడ్డి తన సొంత పత్రికను తన పార్టీకార్యకర్తలకు ఉచితంగా ఇవ్వలేరా? వాలంటీర్లకు ప్రభుత్వ సొమ్మును నెలకు  రూ. 5 వేలు దోచిపెడుతున్న జగన్ రెడ్డి తన సొంత నిధుల్ని జగన్ రెడ్డి దొంగ నాటకాలు మాయమాటలు ప్రజలు నమ్మే రోజులు పోయాయని యనమల తెలిపారు. జగన్ రెడ్డి ఏం చేసినా ప్రభుత్వ ఖజానాను తను, తన మనుషులు దోచుకునేందుకే అన్నది రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్దమవుతోందని ఆయన ఆరోపించారు. 

చేసేది తక్కువ ప్రచారం ఎక్కువ

ప్రజలకు ఉపయోగపడే విదేశీ విద్య, పేదల కడుపు నింపే అన్నక్యాంటీన్, ముస్లిం యువతులకు దుల్హన్ పధకం, బీసీల ఉపాధికి చేయూతనిచ్చే ఆధరణ పనిముట్లు, ఎస్సీ,ఎస్టీ, బీసీ మైనార్టీ యువత స్వయం ఉపాధినిచ్చే కార్పోరేషన్ రుణాలు రద్దు చేసిన జగన్ రెడ్డి తన సొంత పత్రికకు మాత్రం కోట్ల రూపాయలు దోచిపెడుతున్నారని యనమల తెలిపారు.

మరో వైపు వైసీపీ నేతలు, కార్యకర్తలు సహజవనరులు దోపిడి చేస్తూ ప్రభుత్వ స్ధలాలు ఖజ్జా చేస్తూ కోట్లు కూడబెడుతున్నారని, మరో వైపు ప్రజలపై పన్నుల రూపంలో మోయలేని భారాలు మోపుతూ ఆ మొత్తాలను సొంతపత్రిక, చానల్ కు  జగన్ రెడ్డి ప్రభుత్వం మళ్లిస్తోందని ఆయన తెలిపారు.  జగన్ రెడ్డి ప్రజలకు చేస్తున్న వాటికంటే దాని గురించి ప్రచారం చేస్తూ తన సొంత పత్రికకు ప్రకటనల రూపంలో దోచిపెడుతున్నదే ఎక్కువ అని యనమల తెలిపారు.

ఒక్క సాక్షి పత్రికకే కేవలం 3 ఏళ్లలోనే  రూ. 280 కోట్ల ప్రజాధనాన్ని దోచిపెట్టారు. ఈ సొమ్మంతా ప్రజలదే. జగన్ రెడ్డి లూటీ చేసి తిన్న ప్రతి  రూపాయిని కక్కిచేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారన ఆయన హెచ్చరించారు.

Related posts

గుంత‌ల్లో చేప‌లు ప‌డుతూ నిర‌స‌న‌!!!

Sub Editor

తిరంగా ర్యాలీ: పౌరసత్వ చట్టం చారిత్రక అవసరం

Satyam NEWS

పేదల బియ్యం బ్లాక్ లో అమ్ముకుంటున్న పెద్దలు

Satyam NEWS

Leave a Comment