వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా YSRTP మహబూబాబాద్ పార్లమెంట్ కో కన్వీనర్ రామ సహాయం శ్రీనివాస్ రెడ్డి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ములుగు ప్రభుత్వ హాస్పటల్ లోని రోగులకు పండ్ల పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా రామ సాయం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల తో పేదవారికి నీడనిచ్చి రుణమాఫీ తో రైతన్నకు అండగా నిలిచిన వ్యక్తి వైయస్ రాజశేఖర్ రెడ్డి అని ఆయన తెలిపారు.
ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్ సర్వీస్ తో ఎంతో మందికి పునర్జన్మ ప్రసాదించి వ్యక్తి ఆయన అన్నారు.
రైతులకు ఉచిత విద్యుత్ యువతకు ఉపాధి అందించి చనిపోయినా కూడా తెలుగు ప్రజల గుండెల్లో జీవించి ఉన్న ఒకే ఒక మహా నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని ఆయన అన్నారు.
అలాంటి మహానేతను స్మరిస్తూ తిరిగి అలాంటి రాజన్న రాజ్యం తిరిగి రావాలంటే కేవలం రాజన్న బిడ్డ షర్మిల అక్క తోటి సాధ్యం అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్య నిర్వాహక సభ్యులు బజారు శ్యాం ప్రసాద్ ధారావత్ దేవా నాయక్ ములుగు ప్రభుత్వ హాస్పిటల్ సూపర్డెంట్ జగదీష్ ములుగు మండల కన్వీనర్ ఎండి చాంద్ పాషా ములుగు జిల్లా యూత్ నాయకులు మెట్టు సురేష్ ములుగు సీనియర్ నాయకులు ఇన్నారెడ్డి ములుగు యువజన నాయకులు అన్న తిరుపతి, రాజేందర్ దిలీప్ సోషల్ మీడియా ఇంచార్జ్ ఎండి అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు