మిగులు బడ్జెట్లో ఉన్న తెలంగాణను సీఎం కేసీఆర్ అప్పుల తెలంగాణగా మార్చారని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు అన్నారు. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా జిల్లా కేంద్రంలో చేపట్టిన పాదయాత్ర కార్యక్రమంలో షబ్బీర్ అలీతో పాటు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు పాల్గొన్నారు.
పాదయాత్ర అనంతరం పార్టీ కార్యలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ హాత్ సే హాత్ జోడో యాత్రలో ప్రజలు అనేక సమస్యలు తమ దృష్టికి తెస్తున్నారన్నారు. రేషన కూడా సరైన సమయంలో ఇవ్వడం లేదని ప్రజలు చెప్తున్నారని తెలిపారు. డ్వాక్రా సంఘాలకు ప్రభుత్వం 4250 కోట్ల బకాయి ఉందన్నారు.
బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలు జిఎస్టీ, వ్యాట్ పేరుతో పేదల నడ్డి విరుస్తున్నారన్నారు. ప్రజలు ఏది కొనుక్కునే పరిస్థితి లేదన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ లేదని, ఉద్యోగులకు జీతాలు సమయానికి ఇవ్వడం లేదని, ఆరోగ్యశ్రీ అయితే అసలే లేదన్నారు. దళిత సీఎం హామీ పోయిందని విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్ పెద్ద పెద్ద మాటలు
మాట్లాడుతున్నారన్నారు. పోలీసులు పొలిటికల్ ఏజంట్లుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అన్ని బంద్ చేసినా మద్యం మాత్రం బంద్ చేయడం లేదని, దాని ద్వారా రెవిన్యూ సమకూర్చుకుంటున్నారని తెలిపారు. తాము చేపట్టిన యాత్రలో ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కడతామని చెప్తున్నారని తెలిపారు.