అమరావతిపై సీఎం జగన్ రెడ్డి శీతకన్ను వేశారు. రాజధాని అమరావతిపై జగన్ నిర్లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం నేడు బట్టబయలు చేసింది. జగన్ సర్కార్ అమరావతికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయ లేదు. పార్లమెంట్ సాక్షిగా ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ గా తీసుకోవాల్సిన అమరావతి అభివృద్ధిపై జగన్ సర్కార్ తీవ్ర నిర్లక్ష్యం చేసింది. స్మార్ట్ సిటీస్ మిషన్ కింద దేశంలో ఎంపిక చేసిన వంద నగరాల్లో ఏపీ నుంచి అమరావతి, కాకినాడ, తిరుపతి, విశాఖపట్నం ఎంపిక చేశారు. స్మార్ట్ సిటీగా అమరావతిని అభివృద్ధి చేసేందుకు 21 పనుల ప్రాజెక్టుల కింద రూ.2,046 కోట్లు కేంద్రం కేటాయించింది.
అయితే అమరావతిలో ఇప్పటికీ ఒక్క పనిని కూడా చేపట్టలేదు. స్మార్ట్ సిటీల పనుల పురోగతిపై లోక్ సభలో ఎంపీ రఘురామ ప్రశ్నకు కేంద్రమంత్రి కౌశల్ కిషోర్ రాతపూర్వకంగా ఈ సమాధానం ఇచ్చారు.