42.2 C
Hyderabad
April 26, 2024 17: 58 PM
Slider మహబూబ్ నగర్

కరోనా కట్టడి కోసం ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి

#Guvvala Balraj

కరోనా వైరస్ విజృంభించకుండా కట్టడి చేయడంలో ప్రతిఒక్కరూ పాటుపడాలని ప్రభుత్వం సూచించిన నిబంధనలను పాటించి ప్రజలకు వివరించాలని ప్రభుత్వ విప్, నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అధికారులను కోరారు.

బుధవారం ఆయన జూమ్ యాప్ తో అన్ని మండలాల ఎంపిడిఓ అధికారులతో పాటు, అచ్చంపేట పురపాలక చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. కరోనా కష్టకాలంలో కూడా నియోజకవర్గ అభివృద్ధితో పాటు ప్రజలందరూ వైరస్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన కోరారు.

అవసరమైతే వీధికి ఐదారుగురుతో కలిసి టీం ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తూ..వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని అందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై ఆరాతీసి పనులు వేగవంతంగా జరిగేలా ఎప్పటికప్పుడు తెలియజేస్తూ నిధులను వినియోగించుకోవడం తో బాటు అభివృద్ధి లో ముందుకు పోవాలని సూచించారు.

అదేవిధంగా నియోజకవర్గ డాక్టర్ తో మాట్లాడుతూ కరోనా వైరస్ బారిన వారితో కూడా ఎప్పటికప్పుడు ఆరోగ్యం ఎలా ఉందని తెలుసుకున్నారు. కరోనా కష్టకాలంలో కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రజాప్రతినిధులు,అధికారులు సహకరించాలని ఎమ్మెల్యే సూచించారు.

Related posts

శివధనుర్భంగాలంకారంలో రాములవారి రాజసం

Satyam NEWS

రష్మిక కంటే విజయశాంతికే ఎక్కువ పారితోషికం

Satyam NEWS

నవంబర్ 25న జరిగే పార్లమెంట్ మార్చ్ కరపత్రం విడుదల

Satyam NEWS

Leave a Comment