భారతదేశ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ములుగు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో సమతా దివస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయ క్వాలిటీ కోఆర్డినేటర్ బద్దం సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ అణగారిన వర్గాల పోరాట యోధుడు, విశిష్ట పార్లమెంటేరియన్, నిజమైన అభ్యుదయ ప్రజాస్వామికవాది, కేంద్రమంత్రి , సమర్థ పరిపాలన, అసాధారణ ప్రతిభావంతుడు అని తెలిపారు.
ఆయన జయంతి సందర్భంగా, ఆయన ఆదర్శాలకు, ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని అన్నారు. అట్టడుగు, బలహీన వర్గాల వారిని ప్రగతిపథంలో ఉంచటానికి అందరు కూడా ప్రయత్నం చేసినట్లు అయితే నిజంగా ఆయనకు ఘనమైన నివాళి అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సూర్యనారాయణ, జనగాం బాబురావు, రాజు, సలేంద్రం, శిరుప సతీష్ కుమార్, పోషన్న, కుమార్, కిషోర్, సందీప్, శివ కుమార్, రవి కార్యాలయ సిబ్బంది విక్రమ్, రమేష్, భరత్ తదితరులు పాల్గొన్నారు.