31.7 C
Hyderabad
May 2, 2024 09: 33 AM
Slider ప్రత్యేకం

సకల మానవాళి సంక్షేమమే బీఆర్ఎస్ స్వప్నం

#KCR

దేశంలోని అన్ని వ‌ర్గాలు సంతోషంగా ఉండేలా ఒక మ‌హాన్ భార‌త్ నిర్మిద్దాం అని బీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. స‌క‌ల మాన‌వాళి సంక్షేమ‌మే బీఆర్ఎస్ స్వ‌ప్నం అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. దేశ భ‌విష్య‌త్ కోస‌మే బీఆర్ఎస్ ఆవిర్భ‌వించింద‌ని తేల్చిచెప్పారు. ఒడిశా మాజీ సీఎం గిరిధ‌ర్ గ‌మాంగ్ బీఆర్ఎస్ పార్టీలో చేరిన సంద‌ర్భంగా తెలంగాణ భ‌వ‌న్‌లో ఏర్పాటు చేసిన స‌మావేశంలో కేసీఆర్ ప్ర‌సంగించారు. దేశ భ‌విష్య‌త్‌ను మార్చే సంక‌ల్పంతోనే బీఆర్ఎస్ పార్టీగా ఆవిర్భ‌వించాం. ఈ మ‌హా సంగ్రామంలోక‌లిసి వ‌స్తున్న ఒడిశా రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు స్వాగ‌తం.

న‌వ నిర్మాణ్ కృష‌క్ సంఘ‌ట‌న్ క‌న్వీన‌ర్ అక్ష‌య్ కుమార్ పార్టీలో చేర‌డం సంతోష‌క‌రం. ఎంతో దూరం నుంచి వ్య‌య‌ప్ర‌యాసాల‌కోర్చి వ‌చ్చిన వారంద‌రికి కేసీఆర్ స్వాగ‌తం తెలిపారు. దేశంలోని క్రియాశీల నాయ‌కుల్లో గ‌మాంగ్ ఒక‌రు. రైతుల త‌ర‌పున గ‌మాంగ్ అనేక కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. గ‌మాంగ్ రాజ‌కీయ జీవితం మ‌చ్చ‌లేనిది. గ‌మాంగ్ చేరిక నాకు వెయ్యి ఏనుగుల బ‌లం లాంటిది అని కేసీఆర్ పేర్కొన్నారు.

అమెరికా, చైనా అభివృద్ధి చెందిన దేశాల కంటే వ‌న‌రులు ఎక్కువ ఉన్నాయి. కానీ మ‌న దేశం అభివృద్ధి చెంద‌డం లేదు. భార‌త్ త‌న ల‌క్ష్యాన్ని మ‌రిచింద‌ని పేర్కొన్నారు. దేశ యువ‌త అమెరికా వెళ్లేందుకు త‌హ‌త‌హ‌లాడుతున్నారు. అమెరికా గ్రీన్ కార్డు వ‌స్తే సంబురాలు చేసుకుంటున్నారు. దేశంలో స‌రిప‌డా నీళ్లున్నా పొలాల‌కు మ‌ళ్ల‌వు, స‌రిప‌డా క‌రెంట్ ఉన్న చీక‌ట్లు తొల‌గ‌వు. ప్ర‌భుత్వాలు మారినా రైతులు, కార్మికుల ప‌రిస్థితి మార‌లేదు. దేశంలో గుణాత్మ‌క మార్పు రావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని కేసీఆర్ అన్నారు. ఎన్నిక‌ల్లో గెల‌వ‌డ‌మే నాయ‌కుల‌కు ల‌క్ష్యంగా మారిందని కేసీఆర్ పేర్కొన్నారు.

ఏదో ర‌కంగా ఓట్లు సంపాదించుకోవ‌డ‌మే రివాజుగా మారింది. స్వాతంత్ర్యం ఇచ్చి 75 ఏండ్లు అవుతున్న‌ప్ప‌టికీ తాగ‌డానికి నీళ్లు ఇవ్వ‌ట్లేదు. ఒడిశా మ‌హాన‌దిలో ఎంత శాతం నీళ్ల‌ను వాడుకుంటున్నా. ఈ 75 ఏండ్ల‌లో మ‌నం ఏం సాధించిన‌ట్టు? జాతి, ధ‌ర్మం పేరు చెప్పి గెలిచే వారు ఏం చేస్తారు? పెద్ద పెద్ద ఉప‌న్యాసాలు ఇస్తారు.. కానీ తాగ‌డానికి గుక్కెడు నీళ్లు ఇవ్వ‌రని మండిప‌డ్డారు కేసీఆర్.

రైతులు దేశ రాజ‌ధాని స‌రిహ‌ద్దుల్లో 13 నెల‌ల ఉద్య‌మం ఎందుకు చేశారు. ఇప్ప‌టికీ రైతుల‌కు ఒక భ‌రోసా ఇవ్వ‌లేక‌పోయింది కేంద్రం. అందుకే అబ్ కీ బార్ కిసాన్ స‌ర్కార్ అనే నినాదాన్ని ఎత్తుకున్న‌ది బీఆర్ఎస్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీల‌ను గెలిపించండి.. దేశంలో నీళ్లు, క‌రెంట్ ఎందుకు రావో నేను చూస్తాను. మ‌న‌సు పెట్టి ప‌ని చేస్తే ఏదైనా సాధ్య‌మే. తెలంగాణ‌కు అందుకు సాక్ష్యం. తెలంగాణ‌లో సాధ్య‌మైంది.. దేశ‌మంత‌టా ఎందుకు సాధ్యం కాదు.

తెలంగాణ‌లో ప్ర‌తి ఇంటికి తాగునీరు ఇస్తున్నాం.. దేశ‌మంతా ఎందుకు ఇవ్వ‌లేం. తెలంగాణ‌లో రైతు ఆత్మ‌హ‌త్య‌లు ఆగిపోయాయి.. వ‌ల‌స‌లు వాప‌స్ వ‌స్తున్నాయి. నేను చెప్పేది ధ‌న్ కీ బాత్ కాదు.. మ‌న్ కీ బాత్. క‌రెంట్‌కు దేశంలో కొద‌వ లేదు.. 4 ల‌క్ష‌ల మెగావాట్ల స్థాపిత విద్యుత్ ఉంది. అన్ని ధ‌ర‌లు పెంచుకుంటూ పోవాలి.. జ‌నం జేబులు కొట్టేయాల‌నేదే కేంద్రం యావ‌. పేదోడి క‌డుపు కొట్టాలి.. ఉన్నోడి జేబులు నింపాలి.. దేశంలో న‌డుస్తున్న‌ది ఇదే. రైతులు కూడా చ‌ట్ట‌స‌భ‌ల్లోకి కూడా రావాలి. రైతులు నాగ‌లి ప‌ట్ట‌డ‌మే కాదు.. రాజ్యాంగాన్ని న‌డిపే నాయ‌కులుగా మారాల‌న్నారు కేసీఆర్.

Related posts

గొర్రెలు కాస్తున్న ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ లు

Satyam NEWS

రెండో సారి ఎన్నికై రికార్డు సృష్టించిన ఏలూరు మేయర్ నూర్జహాన్

Satyam NEWS

ఈ నెల 7 నుంచీ బీజేపీ ఉత్త‌రాంద్ర జ‌ల పోరు యాత్ర ప్రారంభం…!

Satyam NEWS

Leave a Comment