27.7 C
Hyderabad
April 30, 2024 10: 54 AM
Slider కడప

ప్రజల కొంపలు ముంచుతున్న కాలువల కబ్జా

#SubCollector

కడప జిల్లా నందలూరు మండలంలోని నాగిరెడ్డి పల్లి పంచాయితీ లో ఇండ్లలోకి పొలాల లోకి చేరిన చెయ్యేటి నీరు పై జనసేన నేతలు శుక్రవారం రాజంపేట సబ్ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.

జనసేన నేత యెద్దల పవన్, సుబ్బారాయుడు డ్యామ్ నీరు ఇళ్ళలోకి చేరుకోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

మొత్తం కాలువలు అక్రమంగా ఆక్రమించి కట్టడాలు కట్టారని తెలిపారు. ఇరిగేషన్ వారికి, రెవెన్యూ వారికి పలు మార్లు విన్నవించినా ఫలితం లేదని వారన్నారు.

ఆక్రమణల మూలంగా నీరు ఇండ్లలోకి పంట పొలాలలోకి చేరి నష్ట పరుస్తోందని, దీని మూలంగా వీధులు జలమయం గా మారి దుర్గంధం గా మారాయని అన్నారు.

ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ వారు వినతి పత్రాన్ని అందించారు.

Related posts

మూగ‌జీవాల ప్రాణ‌ ర‌క్ష‌ణ కోసం వైఎస్ఆర్‌ ప‌శు ఆరోగ్య‌సేవ

Satyam NEWS

పొగిడించుకోవడం తప్ప ఈ ప్లీనరీలో ఏముంది?

Satyam NEWS

గ్రీన్ ల్యాండ్ ఉన్నత పాఠశాలలో కరోనా వైరస్ పై అవగాహన

Satyam NEWS

Leave a Comment