కడప జిల్లా నందలూరు మండలంలోని నాగిరెడ్డి పల్లి పంచాయితీ లో ఇండ్లలోకి పొలాల లోకి చేరిన చెయ్యేటి నీరు పై జనసేన నేతలు శుక్రవారం రాజంపేట సబ్ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.
జనసేన నేత యెద్దల పవన్, సుబ్బారాయుడు డ్యామ్ నీరు ఇళ్ళలోకి చేరుకోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
మొత్తం కాలువలు అక్రమంగా ఆక్రమించి కట్టడాలు కట్టారని తెలిపారు. ఇరిగేషన్ వారికి, రెవెన్యూ వారికి పలు మార్లు విన్నవించినా ఫలితం లేదని వారన్నారు.
ఆక్రమణల మూలంగా నీరు ఇండ్లలోకి పంట పొలాలలోకి చేరి నష్ట పరుస్తోందని, దీని మూలంగా వీధులు జలమయం గా మారి దుర్గంధం గా మారాయని అన్నారు.
ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ వారు వినతి పత్రాన్ని అందించారు.