శ్రీకాకుళం గూనపాలేం కు చెందిన బొండ రమేష్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న విషయాన్ని తెలుసుకుని జనసేన శ్రీకాకుళం నియోజకవర్గ ఇంచార్జ్ కోరాడ సర్వేశ్వరరావు పది వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. బోండ రమేష్ ఇంగ్లీష్ ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్నారు. ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన కుటుంబానికి చెందినవారు కావడంతో క్యాన్సర్ చికిత్స చేయించుకునేందుకు ఇబ్బంది పడుతున్న తరుణంలో సర్వేశ్వరరావు తన దాతృత్వాన్ని చాటుకున్నారు. నగర ప్రజలతో పాటు పట్టణ ప్రముఖులు రమేష్ను ఆదుకొని క్యాన్సర్ నుంచి విముక్తి కలిగినట్లు చేయాలని అంతా కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కొండ ఉదయ శంకర్,సాయి,కామేష్, రవి శంకర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
next post