దగ్గరుండీ అమ్మవారి దర్శనం చేయించిన జేడ్పీ చైర్మన్ చిన్న శీను..!
ఢిల్లీలో ఉండే కేంద్ర మంత్రి విజయనగరానికి వచ్చారు…అటు పార్టీ కేడర్,…ఇటు రాష్ట్ర ప్రభుత్వం.తన రెండు రోజుల పర్యటన నిమిత్తం…నగరానికి వచ్చిన కేంద్ర మంతి ముందుగానే మేధావుల సదస్సుతో పార్టీకి ఎంతపట్టు ఉందో తెలుసుకోగలిగారు.
ఆ మర్నాడు అంటే 26 వ తేదీన అనుకున్న షెడ్యూల్ లో కొన్ని చిన్న చిన్న మార్పలు చోటు చేసుకోగా…ప్రత్యేకించి దేవాలయల సందర్శన పైనే కేంద్ర మంత్రి మాండవీయ దృష్టి పెట్టారు.అందులో భాగంగా తొలుత ఉత్తరాంద్ర ఇలవేల్సు… విజయనగరం ఆడపడుచు శ్రీశ్రీశ్రీపైడితల్లి అమ్మవారిని దర్శించుకున్నారు.నగరంలోనిమూడు లాంతర్ల వద్ద ఉన్న పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్నారు…కేంద్ర మంత్రిమాండవీయ.
జేడ్పీ అతిథిగృహం నుంచీ కేంద్ర మంత్రిని…పైడితల్లి అమ్మవారి దర్శనానికి తీసుకొచ్చారు..జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ సూర్యకుమారీలు. దీంతో ఆలయ అర్చకులు పూర్ణకుంభం తో కేంద్ర మంత్రికి స్వాగతం పలికారు. అమ్మవారి గర్భాలయంలోని తీసుకుని వెళ్లి… అమ్మవారిని దర్శించుకునే చేసారు..జేడ్పీ చైర్మన్.అక్కడే కేంద్ర మంత్రి అమ్మవారికి ప్రత్యేక చేసారు. ఇక్కడ కేంద్ర మంత్రి పర్యటనలో ఎమ్మెల్సీ రఘు రాజు, దేవస్థానం ఈఓ ,సూపరెంటెండ్ంట్ రమణ మూర్తి తదితరులు ఉన్నారు.