29.7 C
Hyderabad
May 1, 2024 06: 04 AM
Slider సినిమా

ద కపిల్ శర్మ షో లో జాన్వీకపూర్

జాన్వీ కపూర్ నటించిన ‘మిలి’ చిత్రం రేపు అంటే నవంబర్ 4న విడుదల కానుంది. ఆమె ఈ థ్రిల్లర్ సినిమాపై చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నట్లు కనిపిస్తున్నది. ఈ చిత్రంలో ఆమెతో పాటు సన్నీ కౌశల్,మనోజ్ పహ్వా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. జాన్వీ ఈ సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆమె ‘ది కపిల్ శర్మ షో’లో కనిపించింది. మలయాళ చిత్రం ‘హెలెన్‌’కి ‘మిలి’ రీమేక్‌. ఈ కార్యక్రమంలో జాహ్నవి కపిల్ శర్మతో పలు విషయాలను పంచుకుంది. నటి తాను చాలా కాలంగా షోలో కనిపించాలని ప్లాన్ చేస్తున్నానని, అయితే లాక్‌డౌన్ కారణంగా, తన ప్రణాళికలు ప్రతి ఒక్కటి విఫలమవుతున్నాయని తెలిపింది. అయితే చివరకు ఇప్పుడు తనకు షోలో కనిపించే అవకాశం లభించిందని చెప్పింది. జాన్వీ కపూర్ కపిల్ శర్మ షోలో మాట్లాడుతూ, ‘ఈ రోజు నేను ‘ది కపిల్ శర్మ షో’కి వచ్చాను. ఈ షోకి వచ్చిన తర్వాత నేను స్టార్‌ స్థాయికి చేరిపోయానని అనిపిస్తోంది’ అని షోలో కపిల్‌ని ఆటపట్టిస్తూ జాన్వీ అన్నది. ‘గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్’ సమయంలో ఈ షో కు రాలేకపోయినట్లు జాన్వీ తెలిపింది.

Related posts

కాపు రిజర్వేషన్లపై నోరు మెదపకపోతే ఎలా సారూ?

Satyam NEWS

కామారెడ్డిలో ఆగని దొంగల బీభత్సం

Satyam NEWS

ఉద్యోగులకు రెండేళ్లకే ప్రమోషన్

Satyam NEWS

Leave a Comment