శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం చెందిన కోడి రామ్మూర్తి నాయుడు జన్మదిన వేడుకలు శ్రీకాకుళం పట్టణంలో క్రీడా ప్రాంగణంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా కోడి రామమూర్తి నాయుడు యువజన సంక్షేమ సంఘం అధ్యక్షుడు డా. గుండబాల మోహన్ విలేకరులు ఉద్దేశించి మాట్లాడుతూ నేటి యువతకు, నేటి క్రీడాకారులకు ఆయన జీవితం ఒక ఆదర్శం అని తెలిపారు. అదేవిధంగా శ్రీకాకుళం పట్టణంలోని కోడి రామమూర్తి నాయుడు స్టేడియం శిధిలమైపోయిందని గత ప్రభుత్వం, నేటి ప్రభుత్వం అభివృద్ధి చేయడంలో వెనకడుగు వేస్తున్నారని బాధపడ్డారు.
ఎప్పటికైనా ప్రజా పాలకులు మేల్కొని ఈ క్రీడా ప్రాంగణాన్ని తక్షణమే పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని ఈ దర్భంగా కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో ఎ.స్బి.ఐ లైఫ్ ఇన్సూరెన్స్ అధినేత అయిన చిలకలపూడి రవికుమార్, మాగ్మా హెచ్డి ఇన్సూరెన్స్ అధినేత అయిన పాల్గొనరావు, శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో పనిచేస్తున్న బాలి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.