ముఖ్యమంత్రి కేసీఆర్ జనరంజక పాలన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై బాల్కొండ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధికి మద్దతు తెలుపుతూ ఏర్గట్ల మండల బీజేపీ పార్టీ బిసి మోర్చా అధ్యక్షుడు కౌడ లింబాద్రి పలువురు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలోటిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి మంత్రి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. మండల,గ్రామ పార్టీ నాయకులతో సమన్వయం చేసుకుంటూ అందరూ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాలని ఈ సందర్బంగా మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రాజా పూర్ణానందం,ఎంపిపి ఉపేందర్, సర్పంచ్ కుండ నవీన్ ,రాజా రెడ్డి,వేశాల నర్సా రెడ్డి, ఆకుల రాజేందర్,జక్కు గంగాధర్,వేశాల చిన్న నర్సయ్య,ఎజాప నడిపి రాజన్న తదితరులు పాల్గొన్నారు.
previous post