17 సంవత్సరాల క్రితం తన కుమార్తె సినీ నటి ప్రత్యూషను దారుణంగా అత్యాచారం చేసి హత్య చేశారని అయితే తనకు న్యాయం జరగలేదని ఆమె తల్లి సరోజినీ దేవి అన్నారు. తన కుమార్తెను దారుణంగా అత్యాచారం చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆమె ఆరోపించారు.
ఆ సమయంలో ఇంత టెక్నాలజీ, ప్రజల్లో ఇంత చైతన్యం, పోరాట పటిమ ఉండి ఉంటే, తనకు కూడా న్యాయం జరిగేదాని సరోజినీ దేవి అభిప్రాయపడ్డారు. ప్రత్యూష కేసును ప్రస్తుతమున్న నిర్భయ చట్టాల పరిధిలోకి తీసుకుని వచ్చి, మరోసారి సమగ్ర విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేశారు.
అత్యాచార నేరస్తులకు పడే శిక్షలపై చట్టాలను మార్చాల్సిన సమయం ఆసన్నమైందని, దిశనే ఓ చట్టం కావాలని సరోజినీ దేవి వ్యాఖ్యానించారు.