38.2 C
Hyderabad
May 3, 2024 20: 17 PM
Slider గుంటూరు

జర్నలిస్టులకు రైల్వే రాయితీ రద్దుచేయటం బాధాకరం

#rameshkumar

ప్రభుత్వానికి ప్రజలకు మధ్యవారధిలాగా పనిచేస్తున్న జర్నలిస్టులకు కేంద్రప్రభుత్వం రైల్వే టికెట్ లో రాయితీని రద్దుచేస్తూ ఆదేశాలు జారీచేయడాన్ని ఖండిస్తున్నామని దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు డా॥గోదా రమేష్ కుమార్ అన్నారు.

ఈరోజు పల్నాడు జిల్లా రొంపిచర్లలో  నిర్వహించిన విలేకర్ల సమావేశంలో రమేష్ కుమార్ మాట్లాడుతూ ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలను  ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి సమస్యల పరిష్కారానికి అహర్నిశలు కృషిచేస్తున్న జర్నలిస్టులకు రైల్వే టికెట్ లో రాయితీని రద్దు చేయడం బాధాకరమని అన్నారు.

తక్షణమే జర్నలిస్టులకు రైల్వే రాయితీ కల్పిస్తూ జీవో జారీ చేయాలని లేని పక్షంలో జర్నలిస్టు సంఘాలతో కలసి ఉద్యమ కార్యచరణచేపడతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సతీష్ కుమార్,సురేష్,శ్రీనివాసరావు,సుధాకర్, మరియబాబు తదితరులు పాల్గొన్నారు.

Related posts

అమరావతిపై నిపుణుల కమిటీ ఏర్పాటు

Satyam NEWS

తాబేళ్లను స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను పట్టుకున్న తెలంగాణ అటవీ శాఖ

Satyam NEWS

ఏపి అవినీతి నిరోధక శాఖ డీజీ ఆకస్మిక బదిలీ

Satyam NEWS

Leave a Comment