29.7 C
Hyderabad
May 2, 2024 05: 15 AM
Slider ఆంధ్రప్రదేశ్

ఏపి అవినీతి నిరోధక శాఖ డీజీ ఆకస్మిక బదిలీ

biswajit

అవినీతి నిరోధకశాఖ డీజీగా ఉన్న కుమార్ విశ్వజిత్ ను ఏపి ప్రభుత్వం ఆకస్మికంగా బదిలీ చేసింది. అవినీతి నిర్మూలన సక్రమంగా జరగడంలేదని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ వ్యాఖ్యలు చేసిన మూడు రోజుల్లోనే ఆయన బదిలీ జరగడం గమనార్హం. కుమార్ విశ్వజిత్ స్థానంలో ప్రస్తుత రవాణాశాఖ కమిషనర్ పి.సీతారామాంజనేయులును ఏసీబీ డైరెక్టర్ జనరల్ గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

విశ్వజిత్ కు కనీసం వేరే పోస్టింగ్ కూడా ఇవ్వలేదు. ఆయన ను డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. రవాణా, రహదారులు భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి ఎం.టి.కృష్ణబాబుకు రవాణాశాఖ కమిషనర్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఏపీపీఎస్సీ కార్యదర్శిగానూ పి.సీతారామాంజనేయులుకు అదనపు బాధ్యత అప్పగించారు.

Related posts

విద్యార్థుల  విద్యా ప్రమాణాలు పెంచేందుకు తొలిమెట్టు

Murali Krishna

ఆరోగ్యంపై ప్రతీ ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలి: విజయనగరం ఎస్పీ దీపిక

Satyam NEWS

రాష్ట్ర స్టాయి షార్ట్ ఫిల్మ్ పోటీల కోసం 30 వ తేది లోపు సీడీలు అందజేయాలి

Satyam NEWS

Leave a Comment