అవినీతి నిరోధకశాఖ డీజీగా ఉన్న కుమార్ విశ్వజిత్ ను ఏపి ప్రభుత్వం ఆకస్మికంగా బదిలీ చేసింది. అవినీతి నిర్మూలన సక్రమంగా జరగడంలేదని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ వ్యాఖ్యలు చేసిన మూడు రోజుల్లోనే ఆయన బదిలీ జరగడం గమనార్హం. కుమార్ విశ్వజిత్ స్థానంలో ప్రస్తుత రవాణాశాఖ కమిషనర్ పి.సీతారామాంజనేయులును ఏసీబీ డైరెక్టర్ జనరల్ గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
విశ్వజిత్ కు కనీసం వేరే పోస్టింగ్ కూడా ఇవ్వలేదు. ఆయన ను డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. రవాణా, రహదారులు భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి ఎం.టి.కృష్ణబాబుకు రవాణాశాఖ కమిషనర్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఏపీపీఎస్సీ కార్యదర్శిగానూ పి.సీతారామాంజనేయులుకు అదనపు బాధ్యత అప్పగించారు.