అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ పాత్రికేయులు రత్న రమణ రాజు ను మాజీ మంత్రి సి కృష్ణ యాదవ్ నేడు పరామర్శించారు. గత కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ రమన్ రాజుని శుక్రవారం అంబర్ పేట డివిజన్ పరిధిలోని పటేల్ నగర్ లో పరామర్శించారు.
ఈ సందర్భంగా కృష్ణ యాదవ్ మాట్లాడుతూ జర్నలిస్టులను ఆదుకోవడానికి మానవత్వ దృక్పథంతో ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రమణ రాజు త్వరగా కోలుకోవాలని కుటుంబానికి అండగా ఉంటానని ధైర్యం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సంతోష్ రాజ్, సతీష్, గణేష్ ముదిరాజ్ ,దాడిగే జగన్, తదితర నాయకులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్ పేట్