32.2 C
Hyderabad
May 8, 2024 22: 51 PM
Slider ముఖ్యంశాలు

అత్యాచారాలను అరికట్టేందుకు కఠిన శిక్షలు అమలు చేయాలి

#janasena

బాలికలు , మహిళలు పైన అత్యాచారాలను అరికట్టేందుకు ప్రభుత్వం వెంటనే కఠినమైన శిక్షలు అమలు చేయాలని జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం రాష్ట్ర కార్యదర్శి కాటం అశ్వని డిమాండ్ చేసారు.

ఇటీవలే విశాఖ జిల్లా ఆగనంపూడిలో అత్యాచారానికి గురై మృతిచెందిన.. విజయనగరం జిల్లా, చీపురుపల్లి నియోజకవర్గం,పి.కె.పాలవలస  గ్రామస్థురాలైన పదమూడేళ్ల  పాండ్రంకి కీర్తన కుటుంబ సభ్యులను జనసేన పార్టీ తరుపున సంఘీభావం తెలిపేందుకు కలిసారు.

ఈ సందర్భంగా ఆమె బాధిత కుటుంబాన్ని కలసి ఓదార్చారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ అభంశుభం తెలియని పసికందులను,మహిళలు …కామాంధుల చేతుల్లో బలైపోతున్నారన్నారని ఆవేదన వ్యక్తం చేసారు.ఇటువంటి ఉన్మాదులకు సరియైన రీతిలో కఠినమైన శిక్షలు అమలుచేసే చట్టాలు ప్రభుత్వం తీసుకురావాలని ఆమె డిమాండ్ చేశారు.

బాధిత కుటుంబానికి తగు న్యాయం చేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి నియోజకవర్గం నాయకులు పెద్ది వెంకటేష్, నాయుడు, యేసు, చిన్నoనాయుడు, వినోద్ కుమార్, విజయనగరం జనసేన పార్టీ నేతలు త్యాడ రామకృష్ణారావు(బాలు), ఎర్నాగుల చక్రవర్తి, రవిరాజ్ చౌదరి, భవాని,తాతంపూడి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Related posts

వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు ప్రధానం

Bhavani

పాముల పండుగ

Satyam NEWS

ఏలూరు ఘ‌ట‌న‌పై హైప‌వ‌ర్ క‌మిటీ ఏర్పాటు

Sub Editor

Leave a Comment