జర్నలిస్టులకు త్వరలోనే ఇళ్ళ స్థలాలు మంజూరు చేయిస్తానని శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం జర్నలిస్టులు స్థానిక శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా సైదిరెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులకు ప్రభుత్వం నుండి అందించే సంక్షేమ పథకాలు వర్తింప చేసేందుకు తన వంతు సహాయ సహకారాలు తప్పకుండా అందిస్తానని అన్నారు.అర్హులైన జర్నలిస్టులకు అక్రిడేషన్ మంజూరు చేయిస్తానని అన్నారు.
ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు కోల నాగేశ్వరరావు,నరేందర్రెడ్డి,రామ్ ప్రసాద్ గౌడ్,దేనుమకొండ శేషంరాజు,దాచేపల్లి దయాకర్రెడ్డి,టి.వి.ఎల్,పిల్లలమర్రి శ్రీనివాస్, పెందుర్తి భాస్కర్,దేవరం వెంకటరెడ్డి, కొమర్రాజు అంజయ్య,దేవరం రాంరెడ్డి, రామకృష్ణ,రమేష్,బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్