మల్దకల్ శ్రీ స్వయంభు లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని శనివారం జిల్లా న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ కే.కుషా సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. న్యాయమూర్తులకు ఆలయ చైర్మన్ ప్రహ్లాద రావు, ఈవో సత్య చంద్రారెడ్డి, అర్చకులు మేళా తాళాలతో ఘనంగా పూర్ణకుంభ స్వాగతం పలికారు.
అనంతరం దేవాలయంలో ప్రత్యేక అర్చనలు నిర్వహించి వారిని ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా దేవాలయ చరిత్రను ఆలయ చైర్మన్ వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో ఒకటవ అదనపు జడ్జి అనిరోజ్ క్రిస్టియన్, సీనియర్ సివిల్ జడ్జి ఘంటా కవితా దేవి, అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జ్ జి ప్రభాకర్, గద్వాల మెజిస్ట్రేట్ ఉదయ నాయక్, ఏజీపీ కృష్ణారెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.