26.7 C
Hyderabad
May 3, 2024 10: 11 AM
Slider కడప

ఎమ్మెల్యే గా నన్ను మళ్లీ గెలిపించండి

#MLA

రాజంపేట నియోజకవర్గం సుండుపల్లి మండలం సొంఠం వారి పల్లి సచివాలయంలో శుక్రవారం జగనన్న సురక్ష క్యాంపులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రాజంపేట శాసనసభ్యులు మేడా వెంకట మల్లికార్జున్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సొంఠం వారి పల్లి లబ్ధిదారులు 895 సర్వే పూర్తి చేసి ఇన్కమ్ సర్టిఫికెట్లు 186, ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్లు 193, స్ప్లిట్టింగ్ రేషన్ కార్డ్స్ 37, ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ లింక్ 33, అగ్రికల్చర్ క్రాప్ 4, స్ప్రెట్టింగ్ రైస్ కార్డ్ 58, మ్యారేజ్ సర్టిఫికేట్ 12, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్స్ 29, మొత్తం 591సర్టిఫికెట్లను పంపిణీ చేసిన రాజంపేట శాసనసభ్యులు మేడా వెంకట మల్లికార్జున్ రెడ్డి పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడా మాట్లాడుతూ ప్రజల మొఖాల్లో చిరునవ్వు చూడడమే ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యం అని, జగన్మోహన్ రెడ్డి ఎంతో ముందు చూపుతో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు సేవచేస్తూ ముందుకెళుతున్నామన్నారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ తాను కానీ మీ అందరికీ మేలు చేసినట్లయితే మీరు మాకు ఓట్లు వేయాలని, ఆశీర్వదించాలని కోరారు రానున్న రోజులలో మరింతగా కష్టపడి పని చేస్తామని ఈ సభ ముఖంగా అందరికీ హామీ ఇచ్చారు సంక్షేమ పథకాలన్నీ అమలు కావాలంటే నే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు తప్పకుండా మీరందరూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని రాజంపేట ఎమ్మెల్యేగా నన్ను ఆశీర్వదించాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సుండుపల్లి మండల అధ్యక్షురాలు శ్రీమతి రాజమ్మ , జడ్పిటిసి ఇస్మాయిల్, సీనియర్ వైసీపీ నాయకులు రామ్ సామి రెడ్డి , సుండుపల్లి జెఎసిఎస్ కన్వీనర్ రెహమాన్ ఖాన్, సర్పంచ్ ఆకుల శ్రీనివాసులు, రాష్ట్ర డైరెక్టర్ రామ్మోహన్ రాజు,రవి కుమార్ రెడ్డి (చింటూ), బాబు రెడ్డి , పవన్ కుమార్ రెడ్డి, భాను ప్రకాష్ రెడ్డి , ముడుకు బాబు రెడ్డి, రామాంజనేయులు రెడ్డి, కామిరెడ్డి తదితర అధికారులు సచివాలయం సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు.

Related posts

వెలుగులు విరజిమ్మనున్న వెంకటగిరి

Bhavani

దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం: ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్

Satyam NEWS

శాంతి నిలయంలో ఘనంగా దీపావళి సంబరాలు

Murali Krishna

Leave a Comment