హైదరాబాద్ సరోజిని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎల్లూర్ గ్రామవాసి శ్రీనివాస్ గౌడ్ ను మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు నేడు పరామర్శించారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండల పరిధిలోని ఎల్లూర్ గ్రామానికి చెందిన M.శ్రీనివాస్ గౌడ్ నెల రోజుల క్రితం ఎల్లూర్ గ్రామ సమీపంలో ప్రమాదవశాత్తు బైక్ అదుపుతప్పి కిందపడటంతో గాయపడ్డాడు. కంటికి గాయమై మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని సరోజిని ఆసుపత్రిలో శాస్త్ర చికిత్స చేయించుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు.
ఈ సందర్భంగా ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత వైద్య సిబ్బందితో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. వారితో పాటు గ్రామ పార్టీ నాయకులు కుటుంబ సభ్యులు తదితరులు ఉన్నారు.