కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం, ఆర్.ఎం.పి పి.ఎం.పిల ఆధ్వర్యంలో ఘనంగా జ్యోతిబా పూలే 196వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు యాదగిరి మాట్లాడుతూ సామాజిక అసమానతల మీద అలుపెరగని పోరాటం చేసి, అణగారిన వర్గాల విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి సందర్భంగా ఘన నివాళులు అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం మండల వర్కింగ్ ప్రెసిడెంట్ అశోక్ రాజ్, మండల ఉపాధ్యక్షుడు భాను చంద్ర గౌడ్, పట్టణ ఉపాధ్యక్షుడు రమేష్, యూత్ ఉపాధ్యక్షుడు సంతోష్, ఆర్.ఎం.పి, పి.ఎం.పి ల సంఘం సభ్యులు రాములు, రవి, పండరి, రఘు, పుండలిక్,కుమ్మరి జితేందేర్ సాయిలు, విఠల్ తదితరులు పాల్గొన్నారు.
జి. లాలయ్య సత్యం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం