హైదరాబాద్ లోని బాగ్ డివిజన్ బాగ్ డివిజన్ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో జ్యోతి రావు ఫూలే జయంతి ఘనంగా జరిగింది. ఓబీసీ మోర్చా అధ్యక్షులు వంజరి రవీందర్, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జి. మల్లేష్ ల ఆధ్వర్యంలో అయ్యప్ప దర్శిని దగ్గర జరిగిన ఈ కార్యక్రమంలో జోగులాంబ గద్వాల జిల్లా బీజేపీ ఇంచార్జి బి. వెంకట్ రెడ్డి, బాగ్ అంబర్ పేట్ డివిజన్ కార్పొరేటర్ పద్మ వెంకట్ రెడ్డి జ్యోతి రావు ఫూలే చిత్ర పటానికి పుష్పాలు సమర్పించారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ జ్యోతి రావు ఫూలే మహిళల అభ్యునతికి విశేషంగా కృషి చేసారని వారి శ్రీమతిని ఉన్నత చదువులు చదువించి మహిళలందరు విద్యను నేర్చుకునే విధంగా అనేక ఉద్యమాల ద్వారా మహిళలకు అవగాహన కలిపించారని అన్నారు.
అదేవిధంగా బీసీ వర్గాలు సమాజం లో అణగారిన వర్గాల అభివృద్ధి కొరకు జ్యోతి రావు ఫూలే పని చేసారని వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జి మల్లేష్, చుక్క జగన్, రవీందర్ మంజరి, డి.వెంకటేష్, రాజేందర్, లక్ష్మణ్ గౌడ్, హేమంత్, నీలకంఠ మురళి, గుగ్గిళ్ళ శ్రీనివాస్, రమేష్, సంజీవ్ తదితరలు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట