31.7 C
Hyderabad
May 2, 2024 07: 20 AM
Slider కడప

తిరుప‌తిలో బీజేపీ గెలుపు ఖాయం..

kadapa Bjp

క‌డ‌ప నగరంలోని వైఎస్సార్ ప్రెస్ క్లబ్ లో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు విలేఖ‌రుల స‌మావేశం..

త్వరలో జరగబోయే తిరుపతి ఎంపీ ఉపఎన్నికలో బీజేపీ గెలుస్తుంది.. దుబ్బాక స్ఫూర్తి తో ఏపీలో కూడా బీజేపీ జెండా ఎగరబోతుంది.. ప్రస్తుత సీఎం పై ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకుని ఓట్లేసి గెలిపించారు.. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్దంగా ప్రస్తుత సీఎం వ్యవహరిస్తున్నారు..

గత టీడీపి హయం లో అవినీతి మూడు రెట్లు ఉంటే ఇప్పటి వైసీపీ ప్రభుత్వ హయాంలో 6 రెట్లు పెరిగింది.. స్థానిక ఎన్నికల్లో ఓటమి భయంతో నే ఎన్నికలు జరగకుండా వైసీపీ ప్రయత్నాలు.. పోలవరం విషయం లో ప్రస్తుత సీఎం జగన్ చేతులెత్తేశారు….

పోలవరం పూర్తి అయితేనే రైతుల జీవన ప్రమాణాలు పెరుగుతాయి.. పోలవరం కి నిధులు ఇచ్చినా కూడా వైసీపీ నేతలు కేంద్రాన్ని నిందిస్తున్నారు.. రాయలసీమ లోనే ఎర్రచందనం దొరుకుతుంది.. అరుదైన వృక్ష సంపదను దోచేస్తున్న ఎర్ర మాఫియా.. అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతుంది..

ఎర్రచందనం అక్రమ రవాణా పై ఇప్పటికే కేంద్ర హోమ్ సహాయ మంత్రికి ఫిర్యాదు చేసాము.. లక్షల టన్నుల ఎర్రచందనం తరలిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.. ఎర్రచందనం లో కోట్లు సంపాదించిన స్మగ్లర్లు అధికార,ప్రతిపక్ష పార్టీ లకు ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తున్నారు.. భవన కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోని ప్రభుత్వం పక్క రాష్ట్రాలకు ఇసుకను తరలిస్తున్నారు..

ఇప్పటికి పది సార్లు ఇసుక విధానాన్ని మార్చిన సీఎం జగన్..


కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన టిడ్కో ఇళ్లను లభ్డిదారులకు ఎందుకు కేటాయించలేదు.. రాష్ట్రం లో క్రికెట్ బెట్టింగ్, పేకాట మాఫియాను పెంచి పోషిస్తున్నారు.. వైసీపీ ఎమ్మెల్యేలు పేకాట ను ప్రవృత్తి గా మార్చుకున్నారు.. గాలేరు, హంద్రీనీవా ప్రాజెక్టుల పై సీఎం జగన్ దృష్టి పెట్టాలి.. భవిష్యత్తులో బీజేపీ ఏపీ లో అధికారాన్ని కైవసం చేసుకుంటుంది అని ధీమా..

Related posts

బీ-ఫాం గ‌డువు పొడిగించిన ఈసీ

Sub Editor

మోదీ పర్యటన: రేపు ఎన్టీఆర్ గార్డెన్, లుంబినిపార్క్ మూసివేత                                                             

Satyam NEWS

ముస్లిం మైనార్టీలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చండి

Satyam NEWS

Leave a Comment