కడప జిల్లా ప్రొద్దుటూరు లో 30 సంవత్సరాల క్రితం ఉన్న ప్యాక్షన్ ను రూపుమాపడనికి ఎంతో కృషి చేశామని మాజీ ఎమ్మెల్యే వరద రాజుల రెడ్డి తెలిపారు.
టీడీపీ నేత నందం సుబ్బయ్య హత్య పొలిటికల్ హత్య అని అన్నారు. చనిపోయిన తరువాత కేసు పెట్టె సమయంలో సుబ్బయ్య భార్యను తప్పుదోవ పట్టించారన్నారు.
ఈ కేసులో బలం లేదని కోర్టులో నిలబడే పరిస్తితులు కనిపించడం లేదని అనుమానం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగానే కేసు నీరుగార్చారన్నారు.
ప్రొద్దుటూరు లో మళ్ళీ ఇటువంటివి జరిగే అవకాశాలు ఉండేలా కనిపిస్తున్నాయన్నారు. అధికార పార్టీ నాయకులు హింసను విడనాడి ప్రజా సేవ చేయాలన్నారు.
నిన్న వచ్చిన వైసీపీ MLA లు హత్య చూసిన వారిలా మాట్లాడటం విడ్డురంగా ఉందన్నారు. ఏ పార్టీ వారు అయిన విగ్రహాలు పడగొట్టమని చెప్పరని,వీటన్నింటికి ప్రజలే సమాధానం చెబుతారన్నారు.