విజయవాడ పూర్ణానందపేటలో శ్రీ లక్ష్మీ నారాయణస్వామి ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన కాలభైరవస్వామి విగ్రహప్రతిష్ఠ ఈ నెల 7వతేదీన నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యదర్శి కృష్ణప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా గోడపత్రికను ఆయన విడుదల చేశారు. ఈ కార్యక్రమం గన్నవరం భువనేశ్వరిపీఠం సత్యానంద భారతీస్వామి ప్రత్యేక పర్యవేక్షణలో జరుగుతుందని, ముఖ్యఅతిధిగా విశ్వహిందూపరిషత్ కేంద్రియ సంయుక్త కార్యదర్శి కప్పగంతు కోటేశ్వరశర్మ హాజరవుతారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో శివాజీ, కృష్ణమోహన్, బాబూరావు, మురళి, శివశంకర్, తదితరులు పాల్గొన్నారు.