33.7 C
Hyderabad
April 29, 2024 01: 53 AM
Slider ఆంధ్రప్రదేశ్

న్యూ డైమన్షన్: ఇదేమి ట్విస్టు సోదరా?

amaravathi 26

రాజధాని తరలింపు నిర్ణయం నేపథ్యంలో ఇంతకాలం కొత్త భవనం లీజుకు తీసుకోవాలో వద్దో తెలియక తికమక పడిన ఏపీ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఎట్టకేలకు అమరావతి ప్రాంతంలోనే మరో భవనంలోకి మారింది. నాలుగేళ్లుగా తాడేపల్లి లో కొనసాగుతున్న ఏపీ రాష్ట్ర ఉన్నత విద్యామండలి బుధవారం నుంచి మంగళగిరి 6వ బెటాలియన్‌ రోడ్డు(శ్రీరామ్‌నగర్‌-ఆత్మకూరు గ్రామం)లోని నీలాద్రి టవర్‌-3,4,5 అంతస్థులలోకి తరలింది.

ఇక నుంచి మండలి కార్యకలాపాలు అక్కడ నుంచే నడుస్తాయి. లీజు ఒప్పందం మేరకు దాదాపు రూ.25లక్షలు అద్దెకింద అడ్వాన్స్‌ గా చెల్లించిన మండలి, గత డిసెంబరులోనే కొత్త భవనంలోకి తరలించాల్సి ఉంది. అయితే రాజధాని మార్పుపై కొంత ఊగిసలాడినప్పటికీ ఎట్టకేలకు కొత్త భవనంలోకి మార్చారు.

Related posts

చట్టాలపై అవగాహనకలిగి ఉంటే సత్వర న్యాయం దక్కుతుంది

Satyam NEWS

ప్రధాని మోడీ ఆరోగ్యం కోసం రుద్ర హోమం

Satyam NEWS

అర్థరాత్రి కర్ఫ్యూ పరిస్థితి ని పరిశీలించిన విజయనగరం ఏఎస్పీ

Satyam NEWS

Leave a Comment