ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ హెచ్.బి కాలని కైలాసగిరి అయ్యప్ప సేవాసమితి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములు బైరీ నవీన్ ను అరెస్ట్ చేయవలసింది గా డిమాండ్ చేస్తూ హెచ్.బి కాలని నుండి ఈసిఐఎల్ వరకు ర్యాలీ నిర్వహించి కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడిన నవీన్ అదే విధంగా స్టేజి పై ఉన్న ప్రతి ఒక్కరినీ అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జయమోహన్ గురుస్వామి, గోపాల్ చారి, రాం ప్రదీప్, సంతోష్ చారి తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా