బాగ్ అంబర్పేట్ డివిజన్లోని ఎస్బిఐ ఎస్బిహెచ్ ఆఫీసర్స్ కాలనీ లో వాటర్ పొల్యూషన్, స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుకు స్పందించిన స్థానిక కార్పొరేటర్ బి.పద్మవెంకటరెడ్డి నిన్నటి రోజున అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈరోజు వాటర్ పొల్యూషన్ బోర్డ్ జనరల్ మేనేజర్ రఘునందన్ వాటర్ వర్క్స్ సిబ్బంది బాలకృష్ణ, లక్ష్మణ్ తో వచ్చి పరిశీలించారు. వెంటనే మరమ్మతులు చేపట్టి సమస్య పరిష్కరించాలని కార్పొరేటర్ అధికారులకు సూచించారు. బిజెపిడివిజన్ అధ్యక్షులు చుక్క జగన్, బిజెపి డివిజన్ ప్రధాన కార్యదర్శి జమ్మిచెట్టి బాలరాజు, బిజెపి నాయకులు రామిరెడ్డి, గుగ్గిళ్ళశ్రీనివాస్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట