శ్రీ కాలభైరవ స్వామి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. దక్షిణ కాశీగా పేరుగాంచిన ఇసన్నపల్లి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామి వారిని దర్శించుకుని పరవశించిపోయారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఇసన్నపల్లి రామారెడ్డి శ్రీ కాలభైరవస్వామి జన్మదిన వేడుకలు కన్నుల పండుగలా సాగాయి. ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో చేరుకుని పూజలు నిర్వహించారు. ఉత్సవాల సందర్బంగా ఆలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. స్వామి వారి జన్మదినం సందర్బంగా ప్రత్యేకంగా తయారు చేయించిన విగ్రహాన్ని డోలు బాజాల మధ్య ఊరేగించారు. ఆలయ కమిటీ చైర్మన్ గంజ్ సతీష్ గుప్తా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్బంగా ఆలయ కమిటీ ఈఓ శ్రీరామ్ రవీందర్ మాట్లాడుతూ… ప్రతి సంవత్సరం ఆలయంలో స్వామివారి జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తామన్నారు. 5 రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు భక్తులు వేలాదిగా తరలి వస్తారని తెలిపారు. నేడు స్వామివారి జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రేపు స్వామివారి రథోత్సవం, అగ్నిగుండాల కార్యక్రమాలు ఉంటాయని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
previous post