తెలంగాణ రాష్ట్రం లోని అన్ని న్యాయస్థానాలకు ఆగస్ట్ 14 వరకు లాక్ డౌన్ పొడిగిస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ ఏ. వెంకటేశ్వర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేసినట్లు బార్ అసోసియేషన్ అధికార ప్రతినిధి కాల్వ శ్రీనివాస రావు శనివారం విలేఖరులకు తెలిపారు.
అత్యసరమైన కేసులను ఈ ఫైలింగ్ ద్వారా, భౌతిక ఫైలింగ్ ద్వారా దాఖలు చేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. భౌతిక దూరం పాటించటం, మాస్కులు ధరించటం తప్పనిసరని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాత్రమే న్యాయవాదులు ఆర్గ్యుమెంట్ వినిపించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు ఆయన తెలిపారు. కక్షిదారులు న్యాయస్థానాలకు హాజరు కావద్దని ఆయన కోరారు.