38.2 C
Hyderabad
April 29, 2024 20: 01 PM
Slider ప్రత్యేకం రంగారెడ్డి

అధికార పార్టీ ఎంఎల్ఏ మాధవరంపై ఐటి దాడులు

Madhavaram-Krishna-Rao

కూకట్ పల్లి ఎం ఎల్ ఏ మాధవరం కృష్ణారావు ఇల్లు, కార్యాలయంలో ఐటి దాడులు జరుగుతున్నాయి. ఉదయం నుంచి దఫ దఫాలుగా ఐటి అధికారులు మాధవరం కృష్ణారావు ఇంట్లో సోదాలు జరుపుతున్నారు. అధికార టిఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంఎల్ఏ ఇంటిపై ఐటి దాడులు జరగడం సంచలనం సృష్టిస్తున్నది. వెంకటరావు నగర్ కాలనీ లోని ఆయన ఇల్లు మొత్తం ఐటి అధికారులు సోదాలు చేశారు. మాధవరం కృష్ణారావుకు ముగ్గురు బినామీ లు ఉన్నట్లు కూడా ఐటి అధికారులు గుర్తించారు. ఈ ముగ్గురిలో ఒకరు ఒక ప్రముఖ పత్రికకు సంబంధించిన విలేకరి అనే విషయం కూడా వెలుగులోకి వచ్చింది. మాధవరం కృష్ణారావుకు కన్షట్రక్షన్ కంపెనీలు ఉన్నాయి. అదే విధంగా భూ కబ్జాలు చేశాడని ఆరోపణలు ఉన్నాయి. మాధవరం కృష్ణారావు కార్యాలయం ఇల్లు పై ఐటి దాడులు చేయడం అధికార పార్టీలో సంచనం కలిగించింది. ఈయన వద్ద ‘‘పెద్దల’’ పెట్టుబడులు కూడా ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఐటి దాడుల్లో ఈ అంశాలు బయటపడితే మరింత మందికి ప్రమాదం పొంచి ఉంటుందని విశ్వసనీయంగా తెలిసింది.

Related posts

పోస్ట్ ప్రొడక్షన్ లో అడుగు పెట్టిన ‘ఎక్కడికో ఈ అడుగు’

Sub Editor

అంకితా భండారీ మృతదేహం వెలికితీత

Satyam NEWS

గాయపడ్డ వ్యక్తికి ఆస్పత్రికి తరలించిన పోలీసులు

Satyam NEWS

Leave a Comment