33.7 C
Hyderabad
April 28, 2024 00: 16 AM
Slider విజయనగరం

విజయనగరంలో విభిన్న ప్రతిభావంతులకు ల్యాప్ ప్టాప్ ల పంపిణీ

#vijayanagaramcollector

ఇదేంటో తెలుసా..?  దీన్ని ఎలావాడాలో తెలుసా..?  నీకు ఉప‌యోగ‌ప‌డుతుందా..?  ఇలా మాట్లాడింది.? మ‌రెవ్వ‌రో కాదు విజ‌య‌న‌గ‌రం జిల్లా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి. విభిన్న ప్ర‌తిభావంతుల‌కు, వికలాంగులు, అంధులు,బ‌దిరులు కూడా ఉన్నారు…. వాళ్లంద‌కీ స్వ‌యం ఉపాధి ద్వారా… ప్ర‌భుత్వంద్వారా లాప్ టాప్ ల‌ను క‌లెక్ట‌ర్ అందించారు. ఈ సంద‌ర్బంగా ల్యాప్ టాప్ ల‌ను ఇచ్చేముందు…వాళ్ల‌తో క‌లెక్ట‌ర్ పై విధంగా మాట్లాడారు.

ఈ మేర‌కు విభిన్న ప్రతిభావంతుల సహకార సంస్థ ద్వారా అంధులకు, బధిరులకు  13  లాప్టాప్ లను జిల్లా కలెక్టరు సూర్య కుమారి అందజేశారు.  కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన  స్పందన కార్యక్రమంలో  35 వేల  రూపాయలు విలువ చేసే లాప్టాప్ లను, టచ్ ఫోన్ ను , 6 వేల రూపాయలు విలువైన 3 ట్రై సైకిళ్లను అందజేశారు.

వరల్డ్ విజన్ స్వచ్చంద సంస్థ, సెట్విస్ ఆధ్వర్యంలో 100 మంది విభిన్న ప్రతిభావంతులకు సుమారు 20 లక్షల విలువ చేసే ట్రై సైకిళ్లను కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. వికలాంగుల కోటా లో  బాక్లాగ్ ఖాళీలలో 7 గురు విభిన్న ప్రతిభా వంతులకు పబ్లిక్ హెల్త్ వర్కర్స్ గా విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ లో నియమిస్తూ   ఉద్యోగ నియామక ఉత్తర్వులను కలెక్టర్ అందజేసారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్లు మయూర్ అశోక్, వెంకట రావు, డి.ఆర్.ఓ గణపతి రావు, సెట్విస్ సి.ఈ.ఓ విజయకుమార్, ఇంచార్జ్ ఏ.డి కీర్తి తదితరులు పాల్గొన్నారు.

Related posts

భూ నిర్వాసితుల గోడు పట్టించుకోని టిఆర్ఎస్ నేతలు

Satyam NEWS

కొత్త కార్పొరేషన్ చైర్మన్ లకు జగన్ ప్రభుత్వం షాక్

Satyam NEWS

రాజకీయ కురువృద్ధులు యడ్లపాటి మృతికి చంద్రబాబు సంతాపం

Satyam NEWS

Leave a Comment