తాము హిందువులకు వ్యతిరేకం కాదని, కేవలం ఎన్ఆర్సీ, సీఏఏ, ఎన్పీఆర్లకు మాత్రమే తాము వ్యతిరేకమని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. ముస్లిం యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్లో నిర్వహించిన బహిరంగ సభలో అసదుద్దీన్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రధాని నరేంద్రమోదీపై ఆయన నిప్పులు చెరిగారు. భారతదేశం అన్ని మతాల సంగమమని, ఈ దేశాన్ని మోదీ మూడు ముక్కలు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. తెలంగాణను సెక్యులర్గా ఉంచుతామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారన్నారు. తన పౌరసత్వాన్ని అడిగే హక్కు మోదీకి లేదని అసద్ పేర్కొన్నారు. తాను హిందువులకు ఎంతమాత్రమూ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.