ప్రకాశం జిల్లా కంభం సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజేష్ కుమార్ తన బృందంతో ఎంతో సాహసం చేసి జరికొండ జలపాతంలో చిక్కుకుపోయిన వారిని కాపాడారు. రాజేష్ కుమార్ అర్ధవీడు పోలీస్ స్టేషన్ ను సందర్శించేందుకు అక్కడకు బయలుదేరారు. ఆ సమయంలో అర్ధవీడు ఎస్సై వెంకటేశ్వర నాయక్ కు ఒక ఫోన్ కాల్ వచ్చింది. అంకభూపాలం గ్రామంలోని శివాలయం లో దైవదర్ధనానికి కొందరు వెళ్లారని అక్కడ జరికొండ జలపాతం ఒక్క సారిగా పొంగడంతో అందరూ ప్రమాదంలో చిక్కుకున్నారని ఆ ఫోన్ కాల్ సారాంశం. ఇది విన్న వెంటనే కంభం సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజేష్ కుమార్ స్పందించారు. అర్ధవీడు ఎస్సై వారి టీం తో కలిసివెళ్లి ఎంతో రిస్క్ చేసి అక్కడ భారీ వర్షం కారణంగా జరికొండ జలపాతం వద్ద చిక్కుకుపోయిన యాత్రీకులను కాపాడారు. సీఐ చూపిన సాహసాన్ని అందరూ అభినందిస్తున్నారు.