40.2 C
Hyderabad
April 28, 2024 18: 20 PM
Slider ప్రకాశం

సాహసం చూపి యాత్రీకులను కాపాడిన కంభం సీఐ

#kambhampolice

ప్రకాశం జిల్లా కంభం సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజేష్ కుమార్ తన బృందంతో ఎంతో సాహసం చేసి జరికొండ జలపాతంలో చిక్కుకుపోయిన వారిని కాపాడారు. రాజేష్ కుమార్ అర్ధవీడు పోలీస్ స్టేషన్ ను సందర్శించేందుకు అక్కడకు బయలుదేరారు. ఆ సమయంలో అర్ధవీడు ఎస్సై వెంకటేశ్వర నాయక్ కు ఒక ఫోన్ కాల్ వచ్చింది. అంకభూపాలం గ్రామంలోని శివాలయం లో దైవదర్ధనానికి కొందరు వెళ్లారని అక్కడ జరికొండ జలపాతం ఒక్క సారిగా పొంగడంతో అందరూ ప్రమాదంలో చిక్కుకున్నారని ఆ ఫోన్ కాల్ సారాంశం. ఇది విన్న వెంటనే కంభం సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజేష్ కుమార్ స్పందించారు. అర్ధవీడు ఎస్సై వారి టీం తో కలిసివెళ్లి ఎంతో రిస్క్ చేసి అక్కడ భారీ వర్షం కారణంగా జరికొండ జలపాతం వద్ద చిక్కుకుపోయిన యాత్రీకులను కాపాడారు. సీఐ చూపిన సాహసాన్ని అందరూ అభినందిస్తున్నారు.

Related posts

తండ్రి ఆత్మహత్యను సెల్ ఫోన్ లో వీడియో తీసిన 4 ఏళ్ల కొడుకు

Bhavani

జిహెచ్ఎంసి మేయర్ గా సింధు ఆదర్శ్ రెడ్డి?

Satyam NEWS

వన్యప్రాణి సంరక్షణతోనే జీవసమతుల్యత సాధ్యం

Satyam NEWS

Leave a Comment