విద్య, కళలు, సైన్స్, స్పోర్ట్స్, సోషల్ వెల్ఫేర్, కామర్స్, పర్యావరణ పరిరక్షణ పై సమాజం లో చైతన్యం, అవగాహన, సేవలను అందించేందుకు యల్ హెచ్ యల్ ‘కంచన ఫౌండేషన్’ ప్రారంభించినట్లు ఫౌండేషన్ చైర్మన్ కె. లలిత్ కుమార్ తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గుర్తింపు, ఆమోదం ‘ కంచన ఫౌండేషన్ ‘ పొందిందన్నారు. తాము గత 15 సంవత్సరాలు గా ఐఐటీ-జేఈఈ/నీట్ ఫోరం ను నిర్వహిస్తున్నామని లలిత్ కుమార్ తెలిపారు.
ఇక పై ఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఐఐటీ-జేఈఈ/నీట్ ఫోరం, అభిస్టా,అభిజ్ఞ ప్రోగ్రాం లతో స్కూల్ స్థాయి నుండి డిజిటల్ ఎడ్యుకేషన్ ను అందించనున్నామని తెలిపారు.