ఎన్ టిఆర్ విద్యాసంస్థలు గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గెస్ట్ (GEST)ను ఈ సంవత్సరం డిసెంబర్ 4న నిర్వహించనున్నట్లు ఎన్.టి.ఆర్ విద్యాసంస్థల మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన మొదటి 25 మంది బాలికలకు ఎన్.టి.ఆర్ విద్యాసంస్థల ద్వారా ఉపకారవేతనం అందజేయబడుతుందన్నారు. ఈ క్రమంలో మొదటి 10 ర్యాంకులు పొందిన బాలికలకు నెలకు 5 వేల రూపాయల చొప్పున, తరువాతి 15 ర్యాంకులు పొందిన బాలికలకు నెలకు 3 వేల రూపాయల చొప్పున ఎన్.టి.ఆర్ బాలికల జునియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేసే వరకు ఇవ్వబడునని తెలిపారు. ఈ అవకాశాన్ని 10వ తరగతి చదువుతున్న బాలికలందరూ వినియోగించుకోవాలని కోరారు. ఆసక్తి గల విద్యార్థినులు ఎన్టిఆర్ ట్రస్ట్ వెబ్ సైట్ లో ఈ నెల 11 వ తేదీ నుండి 30 వ తేదీ లోగా నమోదు చేసుకోవాలన్నారు.
next post