26.7 C
Hyderabad
May 3, 2024 11: 03 AM
Slider ముఖ్యంశాలు

విద్యార్థినులకు ఎన్.టి.ఆర్ ట్రస్ట్ స్కాలర్షిప్ టెస్ట్

#ntrtrust

ఎన్ టిఆర్ విద్యాసంస్థలు గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న  గెస్ట్ (GEST)ను  ఈ సంవత్సరం డిసెంబర్ 4న నిర్వహించనున్నట్లు ఎన్.టి.ఆర్ విద్యాసంస్థల మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి  తెలిపారు.  ఈ పరీక్షలో అర్హత సాధించిన మొదటి 25 మంది బాలికలకు ఎన్.టి.ఆర్ విద్యాసంస్థల ద్వారా ఉపకారవేతనం అందజేయబడుతుందన్నారు.  ఈ క్రమంలో మొదటి 10 ర్యాంకులు పొందిన బాలికలకు నెలకు 5 వేల రూపాయల చొప్పున, తరువాతి 15 ర్యాంకులు పొందిన బాలికలకు నెలకు 3 వేల రూపాయల చొప్పున ఎన్.టి.ఆర్ బాలికల జునియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేసే వరకు ఇవ్వబడునని తెలిపారు. ఈ అవకాశాన్ని 10వ తరగతి చదువుతున్న బాలికలందరూ వినియోగించుకోవాలని కోరారు.  ఆసక్తి గల విద్యార్థినులు ఎన్‌టి‌ఆర్ ట్రస్ట్  వెబ్ సైట్ లో  ఈ నెల 11 వ తేదీ నుండి 30 వ తేదీ లోగా నమోదు చేసుకోవాలన్నారు.

Related posts

కొడాలి నాని నోరు అదుపులో పెట్టుకో

Satyam NEWS

పోలీసులా లేక గులాబీ పార్టీకి ఏజెంట్లా?

Satyam NEWS

ఎలర్ట్:అశ్లీల వీడియోలు చూస్తే కటకటాలలోకే

Satyam NEWS

Leave a Comment