ప్రముఖ సంఘసేవకురాలు సి ఐ డి ఆఫీస్ లో వర్క్ చేస్తున్న బాణవత్ శిరీష చిలకలూరిపేట లోని జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు మిటమిన్ మాత్రలు,అన్నం ప్యాకెట్ల పంపిణీ చేశారు. బాణవత్ శిరీష తన పుట్టిన రోజు సందర్భంగా దత్త సాయి పీఠం లో ప్రత్యేక పూజలు జరిపారు.
ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ పూసపాటి బాలాజి మాట్లాడుతూ ఇలా పుట్టిన రోజుల నాడు, ముఖ్యమైన రోజుల్లో సేవ చేయడం చాలా మంచి కార్యక్రమం అని అన్నారు. సేవ చేసే గుణం చిన్నప్పటి నుంచి రావడం ఇంకా విశేషమని, సేవ గుణం లో మేటి శిరీష అని అన్నారు.
శిరీష మాట్లాడుతూ మిటమిన్ మాత్రలు బలం కోసం, ఎముకల పుష్టి కోసం పేదలకు అందజేసామని, ఆకలి తీర్చడం కోసం అన్నం ప్యాకెట్లు అందజేసామని తెలిపారు. జయ జయ సాయి ట్రస్ట్ వారు సేవా కార్యక్రమాలు నిర్వహించడం లో ముందు ఉంటారని తెలిపారు. వారు పేద ప్రజలను ఆదుకోవడం లో ముందు ఉండి దాతల సహకారంతో సహాయ పడటం చాలా గొప్ప విషయం అని తెలిపారు. ట్రస్ట్ సేవలకు అభినందనలు తెలిపారు.