పాలేరు ఎమ్మెల్యే కందాలకు ఈసారి జరిగే ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు లేదని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. గడప గడపకు కాంగ్రెస్ ప్రచార కార్యక్రమాన్ని కూసుమంచి మండలంలోని నర్సింహులగూడెం, చౌట్పల్లి గ్రామాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన గడప గడపకూ తిరుగుతూ కాంగ్రెస్ ఆరు గ్యారంటీల గురించి వివరించారు. కాంగ్రెస్ తోనే సంక్షేమం సాధ్యమని వివరించారు. ఈ సందర్భంగా ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచాక సొంత పనులు చక్కబెట్టుకోవడం కోసం పార్టీ మారిన ఘనుడు కందాల అని విమర్శించారు.
పైసా అభివృద్ధి కూడా ఆయన హాయంలో పాలేరు నియోజకవర్గంలో జరగలేదని ఆరోపించారు. అలాంటి వ్యక్తి ఏ ముఖం పెట్టుకుని ఈసారి ఓటు అడుగుతాడని ప్రశ్నించారు. రాష్ట్రంలో కేసీఆర్ ను, పాలేరులో కందాలను ఇంటికి పరిమితం చేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మట్టె గురవయ్య, పాలేరు నియోజకవర్గ నాయకులు చావా శివరామకృష్ణ, సూర్యనారాయణ రెడ్డి, బజ్జూరి వెంకట్ రెడ్డి, బాబు నాయక్ తదితరులు పాల్గొన్నారు.