40.2 C
Hyderabad
May 6, 2024 17: 43 PM
Slider ఖమ్మం

కందాలకు ఓటు అడిగే హక్కులేదు

#ponguleti

పాలేరు ఎమ్మెల్యే కందాలకు ఈసారి జరిగే ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు లేదని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. గడప గడపకు కాంగ్రెస్ ప్రచార కార్యక్రమాన్ని కూసుమంచి మండలంలోని నర్సింహులగూడెం, చౌట్పల్లి గ్రామాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన గడప గడపకూ తిరుగుతూ కాంగ్రెస్ ఆరు గ్యారంటీల గురించి వివరించారు. కాంగ్రెస్ తోనే సంక్షేమం సాధ్యమని వివరించారు. ఈ సందర్భంగా ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచాక సొంత పనులు చక్కబెట్టుకోవడం కోసం పార్టీ మారిన ఘనుడు కందాల అని విమర్శించారు.

పైసా అభివృద్ధి కూడా ఆయన హాయంలో పాలేరు నియోజకవర్గంలో జరగలేదని ఆరోపించారు. అలాంటి వ్యక్తి ఏ ముఖం పెట్టుకుని ఈసారి ఓటు అడుగుతాడని ప్రశ్నించారు. రాష్ట్రంలో కేసీఆర్ ను, పాలేరులో కందాలను ఇంటికి పరిమితం చేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మట్టె గురవయ్య, పాలేరు నియోజకవర్గ నాయకులు చావా శివరామకృష్ణ, సూర్యనారాయణ రెడ్డి, బజ్జూరి వెంకట్ రెడ్డి, బాబు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

మమ్మల్ని బానిసల్లా చూస్తున్నారు

Satyam NEWS

సిజెఆర్ సమక్షంలో కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యే బీరం వర్గీయులు

Satyam NEWS

జగన్ రెడ్డి సర్కారుపై సర్పంచ్ ల మలిదశ పోరాటం

Satyam NEWS

Leave a Comment