టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ విజయనగరం లో మహిళలు సహస్ర దీపార్చన చేశారు. ఇ మేరకు విజయనగరం రింగ్ రోడ్ “వాజీ” కేబుల్ ఎండీ శ్రీనివాసరావు ఇంటి వద్దే..”బాబు కోసం మేము” అంటూ మహిళలంతా వెయ్యి దీపాలు వెలిగించి… తమ అవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వాజీ కేబుల్ ఎండీ శ్రీనివాసరావు మాట్లాడుతూ… చంద్రబాబు అరెస్ట్ అన్యాయమని…అక్రమ అరెస్ట్ ను నిరసనగా మహిళలంతా దీపాలు వెలిగించారని చెప్పారు. ఈ సందర్భంగా ఆ దీపాల ముందే నిరసనలు వ్యక్తం చేసిన మహిళా మూర్తుల ముందే నేలపై కూర్చొని నిరసన వ్యక్తం చేయడం విశేషం.