ములుగు జిల్లా గోవిందరావు పేట మండలం చల్వాయి గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని జిల్లా కలెక్టర్ యస్.కృష్ణ ఆదిత్య జెడ్పిటిసి హరిబాబు తో కలసి ప్రారంభించారు. అనంతరం కంటి వెలుగు శిబిరాన్ని పరిశీలించిన కలెక్టర్ కంటి వెలుగు శిబిరాల నిర్వహణ సమయంలో ప్రజలు ఒకేసారి రాకుండా ఉదయం కొంతమంది మధ్యాహ్నం మరికొంతమంది వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని, సమర్ధవంతంగా నిర్వహించేందుకు వైద్య బృందాలు సమన్వయముతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎం అండ్ హెచ్ ఓ అప్పయ్య,స్పేషల్ ఆఫీసర్ డిఆర్డిఓ నాగాపద్మజా, వైద్యాధికారులు డాక్టర్ సుకుమార్, డాక్టర్ చంద్రకాంత్, ఎంపీపీ సూడి శ్రీనివాసరెడ్డి, తహసీల్దార్ అల్లం రాజకుమార్, ఎం పిడి ఓ ప్రవీణ్, ఎంపీటీసీలు నాగలక్ష్మి, ఉమాదేవి, సర్పంచ్ ఈసం సమ్మయ్య, ఉప సర్పంచ్ హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
next post