సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని చింతల బజార్లో కాలువ కట్ట మీద ఉన్న ఇండ్లను సర్వే చేస్తున్న అధికారులు పేదలందరికీ న్యాయం చేయాలని టిఆర్ఎస్ 24వ వార్డు అధ్యక్షుడు మలిదశ ఉద్యమకారుడు యడ్ల విజయ్ కోరారు.
అధికారులు పూర్తి స్థాయిలో సర్వే చేసి ఎన్ ఎస్ పి కాలవ కట్టపై ఉన్న బాధితులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసి అన్ని విధాలా ఆదుకునేందుకు శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి కృషి చేస్తానని అన్నారని తెలిపారు.
ఈ సర్వే కార్యక్రమంలో హుజూర్ నగర్ ఎమ్మార్వో వజ్రాల జయశ్రీ, ఆర్ ఐ గాలి శ్రీనివాసు,సుప్రజా,రెవెన్యూ సిబ్బంది,ఆర్ అండ్ బి సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్