కార్తీక సోమవారం సందర్భంగా గుంటూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కోటప్పకొండ భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారు జాము నుంచే భక్తులు రావడం ఆరంభం కావడంతో కోటప్పకొండ మొత్తం శివనామ స్మరణతో మారుమోగింది. సోమవారం ఒక్క రోజే దాదాపు 200కు పైగా అభిషేకాలు జరిగాయి. అత్యధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో అన్ని ఏర్పాట్లు చేసినట్లు దేవస్థానం ఈవో రామకోటిరెడ్డి తెలిపారు. ఒక్క రోజే హుండీ కలెక్షన్ దాదాపుగా మూడు లక్షల రూపాయలు వచ్చాయి.
previous post