నెల్లూరు జిల్లా లోని ప్యూర్ స్మైల్ సేవాసంస్థ చిల్డ్రన్స్ డే సందర్భంగా పక్షోత్సవం నిర్వహిస్తున్నది. ఈ నెల 1వ తేదీన ప్రారంభం అయిన ఈ ఉత్సవాలు నవంబర్ 14తో ముగుస్తాయి. ఒకటో తేదీ నుండి 14వ తేదీ వరకు నిర్వహిస్తున్న బాల్ ఉత్సవ్ కార్యక్రమంలో భాగంగా పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించారు. గీతామయి పిల్లల ఆశ్రమం లో ఈ బాల్ ఉత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహించగా అక్కడ ఉన్న పిల్లలందరికీ సరదాగా గేమ్స్ నిర్వహించారు. పాసింగ్ బాల్, మ్యూజికల్ చైర్స్ ఆటలను నిర్వహించి పిల్లలందరికీ గిఫ్ట్, బిస్కెట్స్ అందించారు. చాచా నెహ్రూ కి పిల్లలంటే చాలా ఇష్టం అందుకని ఈ బాల్ ఉత్సవ్ కార్యక్రమాన్ని ఒక పండుగలాగా నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. పిల్లలు అందరూ సంతోషంగా ఉండాలని ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమం లో గీతామయి ఆశ్రమం నిర్వాహకులు పాండు, అపర్ణ తదితరులు పాల్గొన్నారు.