నూతన పోకడలతో
సమాజం రీతులు మారుతూ
కాలం శరవేగంతో పరుగేడుతూ
రంగుల ప్రపంచంలో బతకులాయే
శ్రమ కోర్వని మనుష్యులు
ఆడంబరాల జీవితాల కోసం
విపత్కర పరిస్థితులకు కారణమై
కాలుష్యపు కోరల్లో చిక్కుకునే…
సమస్త జీవకోటికి మనుగడ లేక
ప్రకృతి, పర్యావరణానికి ముప్పు
అని తెలిసినా ఓ ఆదిదేవా..
ఈ మానవాళి లేక్కచేయరాయే..
నీ పండుగ పేరుతో విఘ్నరాజా
రంగు రంగుల విగ్రహలతో
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ లతో
విషపూరిత రసాయనాలాయే..
నేటి తరానికే
స్వచ్ఛమైన గాలి లేక అల్లాడే
ఇక రేపటి తరానికి
ఏమి మిగుల్చరాయే..
మట్టి గణపతిని పూజించేలా
ఈ మనుష్యుల మనసు మార్చి
21పత్రాల విశిష్టతను తెల్పి
మమ్మల్ని కాపాడు ఓ గణపయ్యా..
పత్తెం వసంత, కరీంనగర్