సకల జనుల పోరాటం నేపథ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు అసెంబ్లీ సాక్షిగా శుభవార్త అందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి ములుగు జిల్లా ప్రజల పక్షాన ములుగు జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు,జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. బంగారు తెలంగాణ లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన అందిస్తున్నారని అన్నారు. అసెంబ్లీ వేదికగా 92142 ఉద్యోగాలు ప్రకటన విడుదల చేయడం హర్షణీయమని ఆయన తెలిపారు. అసెంబ్లీలో గత ప్రభుత్వాలు ఉద్యోగాలు ప్రకటన ఎన్నడూ చెయ్యలేదని, నిరుద్యోగుల కుటుంబాలకు తీపి కబురు అందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి కృతజ్ఞతలు చెబుతున్నాని ఆయన తెలిపారు. అమరవీరుల ఆశయాలను తప్పకుండా కొనసాగిస్తామని ములుగు జిల్లా పరిషత్తు చైర్మన్ కుసుమ జగదీష్ ఈ సందర్భంగా తెలిపారు.
previous post
next post