పోలీస్, రక్షణ విభాగంలో ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖకు దేశంలోనే మొదటి స్థానం లభించింది. వరుసగా 2020,2021లో జాతీయ స్థాయిలో సత్తాచాటి మొదటి స్థానంలో ఏపీ పోలీస్ శాఖ నిలిచింది. స్కోచ్ జాతీయ సంస్థ రాష్ట్రానికి ప్రకటించిన 56 అవార్డులలో 23 అవార్డులను ఏపీ పోలీస్ శాఖ సొంతం చేసుకున్నది. స్వర్ణం తో పాటు ఎనిమిది రజత పతకాలతో మొత్తం 23 అవార్డులు ఏపీ పోలీస్ శాఖ కు దక్కాయి. ఏపీ పోలీస్ శాఖ దేశంలోనే అత్యధిక అవార్డులు(175) సొంతం చేసుకుని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. మహిళల భద్రత, నిర్ణీత సమయంలో చార్జ్ షీట్ల దాఖలు, పోలీస్ శాఖ పరిపాలనలో పూర్తి స్థాయి డిజిటైజ్ విధానం , క్లిష్టమైన కేసులను చేదించడం, అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం విభాగాలలో ఈ అవార్డులు లభించాయి. ప్రజా సేవలో జాతీయ స్థాయిలో తమ పనితీరుతో ఆకట్టుకున్న ప్రతి ఒక్కరికీ డిజిపి శుభాకాంక్షలు తెలిపారు.